హైదరాబాద్ : ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల ముఖ్యమంత్రి క్లల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంతాపం తెలిపారు. సులోచనారాణి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సాహితీ వికాసానికి సులోచనారాణి నవలలు ఉపయోగపడ్డాయని సీఎం పేర్కొన్నారు. సులోచనారాణికి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఇవాళ కన్నుమూశారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని కుపర్టినో పట్టణంలో సులోచనారాణి తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుమార్తె శైలజ చెప్పారు. సులోచనారాణి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాశారు. ఆమె రాసిన నవలల ఆధారంగా అనేక సినిమాలు తీశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. 1970 దశకంలో యుద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది. ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ ధారావాహికలుగా రూపొందించబడ్డాయి.