హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నతాధికారులపై రాజకీయ ఒత్తిళ్లు సహజమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత నాయకులు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటున్నారు కానీ వచ్చే జనరేషన్ను దృష్టిలో పెట్టుకోవడం లేదన్నారు. మన దేశంలో చిన్న పని కావాలన్నా ఆఫీసులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తుందన్నారు. మండల స్థాయిలో వచ్చే పింఛన్ల కోసం కూడా సీఎం ఆఫీసుకు వస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుందన్నారు.