ఉద్యోగం చేసే ప్రతిఒక్కరూ ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఆ ఒక్క రోజు సేద తీరి వారం రోజులు పడిన శ్రమనంతా మర్చిపోతుంటాం. అయితే తనకు మాత్రం ప్రతిరోజూ పనిదినమేనని, ఆదివారం అంటూ ఏమీ ఉండదు అంటున్నారు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్.నిన్న ఆదివారం. ఈ సందర్భంగా గీతా శర్మ అనే నెటిజన్.. ‘హ్యాపీ సండే జీ’ అంటూ సుష్మాస్వరాజ్కు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్కు స్పందించిన సుష్మ.. తనదైన శైలిలో స్పందించారు. ‘గీత.. నాకు ఆదివారం అంటూ ఏమీ ఉండదమ్మా.. నేడు కూడా హ్యాపీ వర్కింగ్ డేనే’ అని సుష్మ ట్వీట్ చేశారు.
కొద్ది గంటల్లోనే ఈ ట్వీట్ వైరల్గా మారింది. సాధారణంగా ఆ ట్వీట్కు స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఆమె సుష్మాస్వరాజ్. ఎంతో నిబద్ధత గల కేంద్రమంత్రి అంటూ ఆమెపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. గతంలోనూ అనేక సందర్భాల్లో సుష్మ తన మానవతాదృక్పథంతో నెటిజన్ల మనసు గెలిచారు.