డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్కు ఈ ఏడాది ఐపీఎల్ ఏమాత్రం కలిసిరాలేదు. మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ముంబయి ఇండియన్స్ ఈ సారి ప్లేఆఫ్లో చోటు దక్కించుకోకుండానే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. తద్వారా ఆ జట్టు సారథి రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. కానీ, రోహిత్ ఈ సీజన్లో పరుగులు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 286 మాత్రమే. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ ఒక సీజన్లో 300లోపు పరుగులు సాధించలేకపోవడం ఇదే మొదటిసారి. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రోహిత్ శర్మ, సురేశ్ రైనా(చెన్నై సూపర్కింగ్స్) ప్రతి సీజన్లోనూ 300లకు పైగా పరుగులు చేస్తూనే ఉన్నారు. కానీ, ఈ ఏడాది రైనా ఆ ఘనతను అందుకున్నా.. రోహిత్ శర్మ మాత్రం విఫలమయ్యాడు.
టోర్నీలో భాగంగా దిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమితో ముంబయి ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఎంతో విజయవంతమైన జట్టుగా పేరు సంపాదించుకున్న ముంబయి ఇండియన్స్ అత్యధికంగా మూడు సార్లు ట్రోఫీని ముద్దాడింది. అలాంటి జట్టు ఈ ఏడాది ప్లేఆఫ్కు కూడా అర్హత సాధించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.