ఢిల్లి – విశాఖ ఎపి ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లినుంచి విశాఖకు వస్తున్న సమయంలో గ్వాలియర్ వద్ద బి 6, బి 7 ఎసి బోగీల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం నాలుగు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంనుంచి 36 మంది ఐఎఎస్ ట్రైనీలు సురక్షితంగా బైటపడ్డారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వద్ద రైలును నిలిపివేశారు. అధికారులు రైలునుంచి ప్రయాణీకులను దింపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.