జనగాం : రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. టీవీ యాంకర్ మహమ్మద్ కయిమ్(లోబో) ప్రయాణిస్తున్న కారు.. ఆటో ఢీకొన్నాయి. లోబో తన కారులో వరంగల్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. లోబోకు జనగాం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. లోబో ప్రయాణిస్తున్న కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారు నెంబర్ - టీఎస్ 09 ఈఎక్స్ 1497.