ఢిల్లీ : ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అక్రమరవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వద్ద నుంచి 6.5 లక్షల నార్కోటిక్ మాత్రలను (మత్తు పదార్థాలు) స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ మాత్రల విలువ రూ.30 కోట్లుందని పోలీసులు వెల్లడించారు. నార్కోటిక్ మాత్రలు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న గ్యాంగ్లో ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.