రాజౌరి : జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో బ్రిడ్జీల (వంతెనలు) నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. వంతెనలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజౌరీ జిల్లా వాసులకు కొత్త బ్రిడ్జీల నిర్మాణంతో కష్టాలు తీరనున్నాయి. జిల్లావ్యాప్తంగా రోడ్డు కనెక్టివిటీ లేని ప్రాంతాలను అనుసంధానిస్తూ ఇప్పటివరకు 83 ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. ఇవేకాకుండా మరో 50 ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిర్మాణం కొనసాగుతున్నది. కొత్త వంతెనల ఏర్పాటుతో సుమారు 300 గ్రామాలకు రోడ్డు కనెక్టివిటి సౌకర్యం కలగనుంది. ఇక నుంచి రాజౌరీ జిల్లావాసులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సిన అవసరముండదు.