భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పడానికి అనువుగా పాక్ పిలుపునిస్తే తక్షణమే సానుకూలంగా స్పందిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇరు దేశాల మధ్య నలుగుతున్న వివాదాల పరిష్కారానికి చర్చలు జరపాలని పాకిస్తాన్ సైనికాధ్యక్షుడు సానుకూలంగా ఉన్నారనే వార్తలపై నిర్మలా సీతారామన్ స్పందించారు.