హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తన పాలన ఆద్యాంతం నిరంకుశంగా సాగిస్తున్నారన్నారు. అంతేగాక, రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శించారు. కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.