హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ఎస్వీనగర్లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కూలర్ల తయారీ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాల సాయంతో సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. రూ.30లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.