ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షమాభిక్ష కోరిన కూచిభొట్ల శ్రీనివాస్ హంతకుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 09:40 AM

వాషింగ్టన్: భారతీయ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను హత్య చేసిన అమెరికా వ్యక్తి పూరింటన్ క్షమాభిక్ష కోరాడు. గత ఏడాది కన్సాస్ నగరంలోని ఓ బార్‌లో ఆడమ్ పూరింటన్ పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ కేసులో మాజీ నేవీ ఉద్యోగి అయిన పూరింటన్‌పై వర్ణవివక్షతో పాటు ఆయుధాలు కలిగి ఉన్న కేసును నమోదు చేశారు. ఆ కేసుల్లో అతను సోమవారం మళ్లీ కోర్టు ముందు హాజరయ్యారు. తనపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని అతను కోరుకున్నాడు. 2017, ఫిబ్రవరిలో తానే కూచిభొట్లను హత్య చేసినట్లు అతను అంగీకరించాడు. ఆ రోజు ఆస్టిన్ బార్‌లో జరిగిన కాల్పుల్లో మరో భారతీయుడు అలోక్ మదసాని గాయాలతో బయటపడ్డాడు. అయితే ఈ కేసులో జీవిత ఖైదు శిక్షను పూరింటన్ అనుభవిస్తున్నాడు. కానీ ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును జూలై 2వ తేదీన వెల్లడించనున్నారు. దాంతో నిందితుడు పూరింటన్.. కోర్టు ముందు తన నేరాన్ని అంగీకరిస్తూ.. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకున్నాడు. ఇయాన్ గ్రిల్లట్ అనే వ్యక్తి.. కాల్పులు జరుపుతున్న పూరింటన్‌ను అడ్డుకున్న విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com