వాషింగ్టన్: భారతీయ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ను హత్య చేసిన అమెరికా వ్యక్తి పూరింటన్ క్షమాభిక్ష కోరాడు. గత ఏడాది కన్సాస్ నగరంలోని ఓ బార్లో ఆడమ్ పూరింటన్ పిస్తోల్తో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ కేసులో మాజీ నేవీ ఉద్యోగి అయిన పూరింటన్పై వర్ణవివక్షతో పాటు ఆయుధాలు కలిగి ఉన్న కేసును నమోదు చేశారు. ఆ కేసుల్లో అతను సోమవారం మళ్లీ కోర్టు ముందు హాజరయ్యారు. తనపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని అతను కోరుకున్నాడు. 2017, ఫిబ్రవరిలో తానే కూచిభొట్లను హత్య చేసినట్లు అతను అంగీకరించాడు. ఆ రోజు ఆస్టిన్ బార్లో జరిగిన కాల్పుల్లో మరో భారతీయుడు అలోక్ మదసాని గాయాలతో బయటపడ్డాడు. అయితే ఈ కేసులో జీవిత ఖైదు శిక్షను పూరింటన్ అనుభవిస్తున్నాడు. కానీ ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును జూలై 2వ తేదీన వెల్లడించనున్నారు. దాంతో నిందితుడు పూరింటన్.. కోర్టు ముందు తన నేరాన్ని అంగీకరిస్తూ.. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకున్నాడు. ఇయాన్ గ్రిల్లట్ అనే వ్యక్తి.. కాల్పులు జరుపుతున్న పూరింటన్ను అడ్డుకున్న విషయం తెలిసిందే.