ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాచకొండలో చిరుతల కలకలం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 11:02 AM

మంచాల : రాచకొండలో చిరుత కలకలం మరోసారి భయాందోళనకు గురిచేసింది. నెలరోజుల్లో రెండు సార్లు ఈ ప్రాంతంలో పులులు కనిపించడంతో రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంచాల మండలం పటేల్‌చెర్వుతండా సమీపంలోని తన గొర్రెల మంద వద్దకు ఆదివారం రాత్రి రెండు చిరుతపులులు వచ్చిన విషయాన్ని గమనించిన రైతు కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు కట్టెలు, డప్పుల చప్పుళ్లతో అక్కడకు రావడంతో చిరుతలు గుట్టల్లోకి వెళ్లినట్లు తెలిపారు. నెలరోజుల క్రితం ఆరుట్ల వద్ద పశువులపాకపై దాడిచేశాయని, మళ్లీ ఆదివారం గొర్రెల మందపై దాడి చేయడానికి యత్నించిన విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com