ఎయిర్ ఇండియా గోవా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. ఈ సమయంలో విమానంలో 143 మంది ప్రయాణికులున్నారు. అంతా సురక్షితమని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 8.36 గంటలకు ఎ1 662 విమానానికి హైడ్రాలిక్ సమస్య రావడంతో ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. ఈ సమయంలో ముందు జాగ్రత్త చర్యగా రన్వేను కొద్దిసేపు మూసేశారు. రాత్రి 9.30 గంటల తరువాత పునరుద్ధరించారు. ఆ సమయంలో రెండో రన్వేను వినియోగించినట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ముంబాయి దేశంలో రెండో అతిపెద్ద విమాన రద్దీ గల విమానాశ్రం. ఇక్కడి నుంచి రోజూ 980 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.