న్యూఢిల్లీ : తాజాగా మంగళవారం కూడా ఇంధనం ధరలు పెరిగాయి. పెట్రోలు లీటరుకు 29 పైసల నుండి 32 పైసలకు పెరగ్గా, డీజిల్ ధర లీటరుకు 26 పైసల నుండి 28 పైసలు పెరిగింది. కర్నాటక ఎన్నికలకు ముందు 19 రోజుల వరకు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు అనంతరం పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముగిసినప్పటి నుండి ఢిల్లీ, కోల్కతా, ముంబయి, చెన్నైలో వరుసగా తొమ్మిది రోజులుగా ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ తాజాగా రూ.2.24 పైసలు, డీజిల్ ధర రూ.2.15 పైసలు, కోల్కతాలో పెట్రోలు రూ. 2.21 పైసలు పెరగ్గా, డీజిల్ రూ.2లకు, ముంబయిలో పెట్రోలు రూ.2.22 పైసలు, డీజిల్ రూ.2.28 పైసలు, చెన్నైలో పెట్రోలు రూ.2.36 పైసలు, డీజిల్ రూ.2.31లకు ఈ పెరుగుదల చేరుకుంది.