బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల్లో అక్రమాలు జరగడం ఇది మొదటిసారి కాదన్నారు. గ్రౌండ్ లెవల్లో ఎన్నికల సందర్భంగా అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. విజయపూర్ జిల్లాలోని మణగులి గ్రామంలో వీవీప్యాట్ మిషన్లు ఖాళీగా పడి ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకురాకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని యడ్యూరప్ప పేర్క్నొనారు. దీనిపై ఎన్నికల అధికారులు స్పందించి.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.