రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ నరసింహన్ అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సును ప్రారంభించారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సదస్సుకు మంత్రి జోగు రామన్న, సీఎస్ ఎస్కే జోషితో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్కే పట్నాయక్, వీసీ ప్రవీణ్రావు హాజరయ్యారు.