హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్ను ఆయన కేటీఆర్ ప్రారంభించారు. శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్ను ఆయన ప్రారంభించారు. శిల్పారామం దగ్గర లగ్జరీ వాష్రూం, లూ కేఫ్ను కూడా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏసీ బస్టాప్ను ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ అరుదైన ఘనత సాధించింది.