జీవ వైవిధ్యం సంరక్షణలో తెలంగాణ ముందంజలో ఉందని అటవీశాఖ మంత్రి జోగురామన్న అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సులో మంత్రి మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపునకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మూడేళ్లలో 87 కోట్ల మొక్కలు నాటిన ఘనత తెలంగాణ సర్కారుదన్నారు. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సహిస్తున్నామన్నారు.