కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తారా? లేదా? అనే సందిగ్ధతకు తెరపడింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హజరవుతున్నారు. ఈ సాయంత్రం ఆయన బెంగళూరుకు వెళ్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మరికొంత మంది పార్టీ నేతలు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ ను కుమారస్వామి ఆహ్వానించిన విషయం తెలిసిందే.