తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా కార్యాలయంలో మంగళవారం భాగ్యరెడ్డివర్మ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా నాయకుడు జాడి శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లికేష్రావు, ఉయ్యాల విష్ణు, ఛత్రపతి శ్రీనివాస్, రవికాంత్, శంకర్, శ్రీకాంత్, శ్రీధర్, సమత, విశ్వవాణి తదితరులు పాల్గొన్నారు.