బెంగళూరు : కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర కూటమి సాధ్యం కాదని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన థర్డ్ ఫ్రంట్ పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడు కుమార స్వామి రేపు కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీని వ్యతిరేకించే పలు పార్టీలను ఆహ్వానించారు.