హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సు ప్రారంభమైంది. సదస్సుకు వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితుల జిల్లా, మండల సమన్వయకర్తలు హాజరయ్యారు. నగరంలోని హెచ్ఐసీసీలో రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సు జరుగుతోంది. సదస్సులో ప్రభుత్వం రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించి ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, ఎల్ఐసీ ఛైర్మన్ వీకే శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.