ఢాకా: బంగ్లాదేశ్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో 12 మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. రంగమతిలోని కాక్స్ బజార్లో 12 మంది మృతి చెందారు. నానియాచార్లో కొండచరియలు విరిగి పడటంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. గత సంవత్సరం వర్షాకాలంలోనూ బంగ్లాదేశ్లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 170 మంది దాకా మృతి చెందారు. 120 మంది నిరాశ్రయులయ్యారు.