హైదరాబాద్ : చార్మినార్ పరిసర ప్రాంతాలు కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. రూ.35కోట్ల వ్యయంతో చేపట్టిన చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చార్మినార్తోపాటు పరిసర ప్రాంతాల్లో వేసిన పేవ్మెంట్ పనులు పూర్తి అయ్యాయి. చార్మినార్ను అంతర్జాతీయస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ పాదచారుల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. చార్మినార్ వద్దకు వాహనాలను అనుమతించకుండా చుట్టూ సుమారు 220 మీటర్ల దూరం నుంచి ఇన్నర్, ఔటర్ రింగు రోడ్ల మీదుగా ట్రాఫిక్ను మళ్లించే ఏర్పాట్లు చేశారు. అక్కడి తోపుడు బండ్లు, ఫుట్పాత్ వ్యాపారులను పరిసర ప్రాంతాలకు తరలించి చార్మినార్ చుట్టూ రాతి నిర్మాణాలు అమర్చారు. చార్మినార్కు వచ్చే రోజువారీ పర్యాటకులతోపాటు రంజాన్ వేళ చార్మినార్ వద్దకు షాపింగ్కు వచ్చేవారు, ప్రార్థనల కోసం మక్కా మసీదుకు వెళ్లేవారు నూతన అందాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు.