రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం గోకుల్ నగర్, కుమ్మరి బస్తీ, పోచమ్మగడ్డలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ఇంటింటి సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 12 ద్విచక్రవాహనాలు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 39 ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్ను సీజ్ చేశారు.