న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పలువురు కేంద్రం మంత్రులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశం కోసం రూపొందించిన అజెండాపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన రాజ్ నివాస్ లో గత ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి విదితమే.