న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంఘీభావం ప్రకటించారు. కేజ్రీవాల్ కు మద్దతు గా ఆయన చేసిన ట్వీట్ లో ఢిల్లీలో అత్యధిక మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి గత ఏడు రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో బైఠాయించి నిరసన తెలుపుతుంటే కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం అని పేర్కొన్నారు.