భూపాలపల్లి: మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం ఆలయంలో హైకోర్టు జడ్జీ జస్టీస్ కేశవరావు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యుటర్ సంజీవ్లు పూజలు చేశారు. ఉదయం ఆలయం చేరుకున్న వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయంలో అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఈవో శ్రీనివాసస్వామి వారికి శేషవస్ర్తాలతో సన్మానించారు.