న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రధాని నరేంద్రమోడీని కోరినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన ఆమె ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తను, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తో కలిసి ప్రధానిని ఢిల్లీ ప్రభుత్వ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరామన్నారు.