హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మిట్టా యాదవరెడ్డి 88వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని హబ్సిగూడలో ఆదివారం ఉదయం నిర్వహించిన సంబురాల్లో మంత్రి కేటీఆర్, జగదీష్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యాదవ రెడ్డి పాత జ్ఞాపకాలను కేటీఆర్ అడిగి తెలుసుకోవడంతో పాటు ఆయన కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా పూల మొక్కతో పాటు జ్ఞాపికను కూడా బహూకరించారు. స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి యాదవ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు. కేక్ కట్ చేసి.. బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాదవ రెడ్డి రాసిన నా జ్ఞాపకాలు పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటోలను మంత్రులు తిలకించారు. అక్కడికి వచ్చిన చిన్నారులతోనూ కేటీఆర్ ముచ్చటించారు. వారందరితో గ్రూప్ ఫొటో దిగారు. దాదాపు గంటకుపైగా సమయాన్ని కేటీఆర్ అక్కడ గడిపారు.