ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజనుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి: లక్ష్మారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 17, 2018, 02:33 PM

మహబూబ్ నగర్ : గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తుందని అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని నేరాళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధి ఊట కుంట తండాలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా తండా వాసులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి గిరిజనులనుద్దేశించి మాట్లాడుతూ..తెలంగాణ ఆవిర్భావంతో రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి వల్ల బీజాలు పడ్డాయన్నారు. ప్రత్యేకించి గిరిజన సమగ్రాభివృద్ధికి కృషి జరుగుతున్నని తెలిపారు. మా తండాల్లో, మా రాజ్యం అనే గిరిజన నినాదాన్ని నిజం చేస్తూ, తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తున్నారని, ఆ ప్రక్రియ పూర్తి కావస్తుందన్నారు. త్వరలోనే తండాలు జీపీలు గా మారుతాయని పేర్కొన్నారు. గిరిజనులు తెలంగాణ ఉద్యమంలోనే గాక, తెలంగాణ పునర్నిర్మాణంలోను కీలక భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com