జనగామ: జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయిన ఇసుక లారీ.. ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.