యాదాద్రి భువనగిరి: మోత్కూర్లోని గాంధీనగర్, అన్నెపువాడలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 150 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 39 బైకులు, 5 ఆటోలు, 2 తుఫాన్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి లెక్కా పత్రాలు లేని 50 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.