హైదరాబాద్: వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను ఎస్ఆర్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 8 మంది సభ్యుల ముఠా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిపై దృష్టిసారించిన పోలీసులు పక్కా ప్రణాళికతో దుండగులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, ఓ స్కార్పియోను స్వాధీనం చేసుకున్నారు.