హైదరాబాద్ : ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు జూబ్లీహిల్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డ్రైవర్ నాగరాజు హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి కుమారుడిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లును విచారణ కోసం పోలీసులు పీఎస్కు పిలిచారు. విచారణ సమయంలో ఐఏఎస్ అధికారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.