ఉత్తరప్రదేశ్: రాష్ట్ర సేవిక సమితి ఆధ్వర్యంలో అలిగఢ్లోని సరస్వతి విద్యా మందిర్లో యువతులకు ఆయుధాలపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. తమపై జరిగే దాడులను తామే ఎదుర్కొనే లాగా వాళ్లుకు ఈ కార్యక్రమంలో శిక్షణ ఇస్తున్నారు. 18 రోజుల పాటు సాగే శిక్షణ ఇవాళ ప్రారంభమైంది. ఆయుధాల ట్రెయినింగ్తో పాటు అనుకోని సమస్య వచ్చినప్పుడు శారీరకంగా, మానసికంగా ఎలా సన్నద్ధులవ్వాలో ఈ శిక్షణలో నేర్పిస్తున్నారు.