రాణి రోష్మణి నౌక భారత తీర ప్రాంత రక్షణ దళంలోకి ప్రవేశించింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ విఎస్ఆర్ మూర్తి ఈ నౌకను కోస్టల్ గార్డ్స్లోకి ప్రవేశపెట్టారు. విశాఖలోని హిందుస్తాన్ షిప్యార్డు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 51 మీటర్ల పొడవైన ఈ నౌకను తయారు చేసింది. ఎంటియు 4000 రకానికి చెందిన ఈ నౌక 34 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీని రాకతో కోస్టల్ గార్డ్ శక్తి మరింత పెరిగింది.