సూర్యాపేట: నియోజకవర్గంలోని యండ్లపల్లి పర్రెకాలువకు మహర్దశ రాబోతున్నది. రెండు కోట్ల రూపాయలకు పైనే అంచనా వ్యయంతో పర్రెకాలువ నిర్మాణాలను పునరుద్ధరించే పనులకు ఇవాళ ఉదయం మంత్రి జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే యండ్లపల్లి గ్రామంలోని 800 ఎకరాల ఆయకట్టుకు మూసి నీరు అందుతుంది. దాని కోసమే మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించడంతో గ్రామంలోని భూములన్నీ సస్యశ్యామలం కాబోతున్నాయి. కేవలం మూసి కాలువల పునరుద్దరణ పనులకే రూ.1,59,52,497 కేటాయించిన ప్రభుత్వం స్లుయిస్ల మరమ్మతు కోసం రూ.28,136ను ఖర్చు చేయనుంది.