నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లో పర్యాటకుల సందడి నెలకొంది. హిల్కాలనీ లాంచీ స్టేషన్లో ఉదయం నుంచి పర్యాటకులు నాగార్జునకొండకు లాంచీలో వెళ్లారు. దీంతో లాంచీస్టేషన్ పరిసరాలు పర్యాటకులతో కిటకిటలాడింది. అధికారులు పర్యాటకులకు లైఫ్ జాకెట్లు అందజేశారు. నాగార్జునకొండలో బుద్ధ్దుడికి సంబంధించిన ఆర్కియాలజీ మ్యూజియంలో పొందుపరిచిన శిల్పా లు, మ్యూజియం వెలుపల గల యజ్ఞశాల, చైత్యా లు, సింహాల విహారంలో ఎత్తైన బుద్ధుడి విగ్రహం, అశ్వవేదయాగశాల, నేలపై ఆనాడు ఇటుకలతో ఏర్పాటు చేసిన స్వస్తిక్ గుర్తు వాటితో నదీలోయ నాగరికతలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను తెలుసుకున్నారు. నదితీరంలో అలలు భారీగా వస్తుండడంతో పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. టూరిజం నాగార్జునకొండకు 4 టిప్పులు లాంచీలను నడపడంతో రూ.89,000 ఆదాయం వచ్చినట్లు టూరిజం మేనేజర్ హరిబాబు తెలిపారు.