పెద్దమ్మ గుడికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయడంపై హైకోర్టు స్టే విధించింది. పెద్దమ గుడికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే విష్ణు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధర్మకర్తలుగా తమ కుటుంబం ఉండగా ట్రస్టు ఎలా ఏర్పాటు చేస్తారని విష్ణు తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని విచారించిన హైకోర్టు ట్రస్టు బోర్డు ఏర్పాటుపై స్టే విధించింది.