భద్రాచలం పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయ ప్రగతిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ప్రభాకర శ్రీనివాస్ భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా అనేక ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి పరిచేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రూ.100కోట్ల నిధులు కేటాయించి ఆలయ ప్రగతికి చర్యలు చేపడుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, త్రిదండి చిన్నజీయర్స్వామి, ఆర్కిటెక్ట్ ఆనందసాయి తదితరులు ఆలయ ప్రగతికి సంబంధించిన తుది నమూనా సిద్ధం చేశారు.