లక్నో : మరో మూడు రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోతుంది. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని ఓ నలుగురు విద్యార్థులు.. వినూత్నంగా యోగా ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మోర్దాబాద్కు చెందిన నలుగురు విద్యార్థులు.. పలు యోగాసనాలను తమ ముఖాలపై వేయించుకుని యోగాకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐరాస డిసెంబర్ 11, 2014న ప్రకటించిన విషయం విదితమే.