కరీంనగర్: రైతు బంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సు జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, ఉమ్మడి జిల్లా అధికారులు, ఆర్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లు, సభ్యులు హాజరయ్యారు. అనంతరం ఆదిలాబాద్ వ్యవసాయం మార్కెట్ యార్డులో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే రైతు బంధు బీమా పథకం అవగాహన సదస్సుకు పోచారం హాజరుకానున్నారు. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఈ సదస్సుకు హాజరవనున్నారు.