హైదరాబాద్: ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయానికి మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. కార్యాలయంలో రెవెన్యూ సంబంధ సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బీఎన్రెడ్డినగర్, సాహెబ్ నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సమస్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. నాగోల్లో నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో కేటీఆర్ను స్థానికులు కలిశారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు సమస్యలను కేటీఆర్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు.