హైదరాబాద్: పసుపు పంట పై హైదరాబాద్లో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్పైస్బోర్డు ఆఫ్ ఇండియా ప్రత్యేక వర్క్షాప్ ప్రారంభమైంది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు అహర్నిషలూ కృషి చేస్తున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు, మిష న్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి, పలువురు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, స్పైస్ బోర్డు కొచ్చి డైరెక్టర్ డా క్టర్ సురేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పార్థసారథి, తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. బేగంపేటలో ఉన్న ప్లాజా హోటల్ లో వర్క్షాప్ ఉదయం, మధ్యాహ్నం వరకు సాగే ఈ వర్క్షాప్ లో తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు రోడ్డు మ్యా ప్ గురించి, పసుపు పంటకు సంబంధించిన పలు అంశాలపై విశ్లేషణాత్మక చర్చను నిర్వహించనున్నారు.