నల్లగొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ నుంచి నార్కెట్పల్లి వైపు బైక్పై వెళుతున్న యువకుడిని వెనక నుంచి రెడిమిక్స్ వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.