భోపాల్ : మధ్యప్రదేశ్లోని 230 శాసనసభ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేయాలని బిఎస్పి నిర్ణయించుకుంది. బిఎస్పి అధినేత్రి మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంతో బిజెపిని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి ఒకే తాటిపై నడవాలనే లక్ష్యం నీరుగారింది. కాంగ్రెస్కు మంచి పట్టు ఉన్న గ్వాలియర్ – చంబల్ రీజియన్పై ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో ఒంటరిగా పోటీ చేయాలని బిఎస్పి నిర్ణయించుకుంది.