హైదరాబాద్: ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ ఆఫీసులో మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. బీఎన్రెడ్డినగర్ సాహెబ్నగర్తో పాటు ఎల్బీనగర్లోని వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మన నగరం కార్యక్రమంలో ప్రజలు మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చిన సమస్యలపై చర్చించారు. సర్వే నెంబర్ 104, 102లకు సంబంధించిన వివాదాలు 15 రోజుల్లో పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ కలెక్టర్కు ఆదేశించారు.