హైదరాబాద్: పోలీసుల కోసం ‘కాప్ కనెక్ట్’ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమాచారం త్వరితగతిన చేరవేసేందుకు ‘కాప్ కనెక్ట్’ ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఇప్పటికే వాట్సాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్లు ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్ గ్రూప్లో 60వేల మంది సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. వాట్సాప్ ఒక్కో గ్రూప్లో గరిష్టంగా 256 మందికే సభ్యులుగా అవకాశం ఉందన్నారు. కాప్ కనెక్ట్ ద్వారా 63వేల మంది ఒకే గ్రూపు ఏర్పాటు చేయొచ్చన్నారు. ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు సమాచారం చేరవేసే అవకాశం ఉందన్నారు. పోలీస్ శాఖలోని 17 విభాగాల్లో కాప్ కనెక్ట్ ద్వారా అనుసంధానం కావొచ్చని, కాప్ కనెక్ట్లో వీడియో కాన్ఫరెన్స్ సౌలభ్యం కూడా ఉందన్నారు. కాప్ కనెక్ట్లో 638 పీఎస్లలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించొచ్చన్నారు.